ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై సుప్రీంలో ఏపీ పిటిషన్- హైకోర్టు ఆదేశాలపై స్టేకు వినతి..
మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇవాళ ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.

Recommended Video
Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన కాలంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటం, ప్రభుత్వ రహస్యాలను బహిరంగపరచడం వంటి ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీన్ని కేంద్రంతో పాటు క్యాట్ కూడా సమర్ధించినా హైకోర్టు మాత్రం స్టే ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications