ఏపీలో టెన్త్ విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు- షెడ్యూల్ ఇదే
ఏపీలో ప్రస్తుత విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లిన విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్ధులు ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈనెల 25వ తేదీ నుంచి దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా ఈ పాఠాలు ప్రారంభం కానున్నాయి.
ప్రతీ రోజూ రెండు గంటల పాటు ఈ పాఠాలను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న హిందీ, ఫిజికల్ సైన్సు,26న ఇంగ్లీషు, నేచురల్ సైన్సు,27న తెలుగు, సోషల్ స్టడీస్,28న హిందీ, గణితం,29న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు,30న తెలుగు, నేచురల్ సైన్సు పాఠాలు బోధిస్తారని, ఈ అవకాశాన్ని పదోతరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.

ఉదయం 10 నుంచి 11గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గణితం, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధిస్తారు.పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేంతవరకు వీడియో పాఠాలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications