ఏపీలో టెన్త్ విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు- షెడ్యూల్ ఇదే
ఏపీలో ప్రస్తుత విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లిన విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్ధులు ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈనెల 25వ తేదీ నుంచి దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా ఈ పాఠాలు ప్రారంభం కానున్నాయి.
ప్రతీ రోజూ రెండు గంటల పాటు ఈ పాఠాలను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న హిందీ, ఫిజికల్ సైన్సు,26న ఇంగ్లీషు, నేచురల్ సైన్సు,27న తెలుగు, సోషల్ స్టడీస్,28న హిందీ, గణితం,29న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు,30న తెలుగు, నేచురల్ సైన్సు పాఠాలు బోధిస్తారని, ఈ అవకాశాన్ని పదోతరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.

ఉదయం 10 నుంచి 11గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గణితం, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధిస్తారు.పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేంతవరకు వీడియో పాఠాలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
-
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications