ఏపీలో కరోనా కట్టడికి రోజుకి 10 కోట్లు - తాజా గణాంకాలు వెల్లడించిన జగన్ సర్కార్
ఏపీలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కరోనా నియంత్రణ చర్యలతో పాటు రోగులకు మందులు, ఆహారం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తాజాగా వీటి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ తమ వేదికల్లో వెల్లడించింది.
కోవిడ్ 19 నియంత్రణ కోసం వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకూ రూ.693 కోట్లు ఖర్చు పెట్టినట్లు తేలింది. ఇందులో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.259 కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల నుంచి రూ. 326 కోట్లు ఖర్చుపెట్టారు. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో రూ.180 కోట్లు ఖర్చుపెట్టినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ నియంత్రణ కోసం దాతలు ఇచ్చిన విరాళాలు కూడా ఇందులోనే ఉన్నాయా లేదా అన్నది వెల్లడి కాలేదు.

Recommended Video
ఇక రోజు వారీ ఖర్చు విషయానికొస్తే వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రూ.4.3 కోట్లు ఖర్చుపెడుతున్నారు. రోగులకు మందులు, ఇతర అవసరాల కోసం రూ.4.57 కోట్లు ఖర్చుపెడుతున్నారు. అలాగే రోగులకు భోజనం కోసం రూ.1.31 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ.10 కోట్ల వరకూ కరోనా నియంత్రణకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఇంత మొత్తం ఖర్చుపెట్టాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రస్తుతం ఇంత భారీ ఖర్చవుతుండటంతో రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడుతోంది.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications