పాపికొండలకు వెళ్లే బోట్ల నిలిపివేత..ఒక్కదానికి పర్మిషన్ లేదు:అయినా డోంట్ కేర్
తూర్పు గోదావరి:రెండు రోజుల క్రితం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైన నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా జలవనరుల శాఖ మేల్కొంది. ఇక్కడకు విహారయాత్రకని సందర్శకులను తీసుకెళ్లే ప్రైవేట్ బోట్లకు ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదని తెలియడంతో ఎట్టకేలకు చర్యలకు పూనుకుంది.
ఆదివారం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జలవనరులశాఖ జూనియర్ సూపరింటెండెంట్ బి.రత్నరాజు ప్రకటించారు. పాపికొండలకు వెళ్లే మొత్తం 68 బోట్లు, లాంచీల్లో ఏ ఒక్కదానికీ పాపికొండలకు వెళ్లడానికి అనుమతులు లేవని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్ల స్పష్టమవుతోంది.
ఆ బోటులో 80 మంది పర్యాటకులు ఉండగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బోటు డ్రైవర్, వీరవరపులంక వాసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఈ నేపథ్యంలో గతంలో కృష్ణానదిలో పడవ మునక...తాజా అగ్నిప్రమాదం తో చాలా బోట్లను అనుమతి లేకుండా తిప్పుతున్నారన్న విషయం తెలియడంతో పడవ ప్రయాణాలపై సందర్శకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన జలవనరులశాఖ...బోట్లు, లాంచీలకు సంబంధించి రెవెన్యూ, పోలీసు, ఫైర్, మత్స్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
ఆ తర్వాత అన్ని అర్హతలు ఉన్న బోట్లకే ఇకపై అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పక్రియ అంతా పూర్తవడానికి నాలుగైదు రోజులు పడుతుందని, అందుకే పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వివరించారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతున్నారు.
అయితే మరోవైపు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలువురు ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు పాపికొండల టూర్ కు తమ బోట్లను సిద్దంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక్కడ తిరుగుతున్న 68 బోట్లలో చాలామంది ప్రభుత్వ ఆదేశాల అనుసారం తమ పడవలను నిలిపివేసినా మరికొందరు టూర్ ఆపరేటర్లు మాత్రం సొమ్ము చేసుకోవడానికి ఇదో అవకాశం గా భావిస్తున్నట్లు తెలిసింది. నిషేధం సంగతి తెలియక ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఇక బోట్లే దిక్కని తద్వారా వారి నుంచి ఎక్కువ ఆదాయం గడించవచ్చని వారు భావిస్తున్నట్లు తెలిసింది. అంతగా ఏమైనా జరిగితే రాజకీయ నేతల అండదండలతో బైటపడవచ్చని వారి ధీమాగా తెలుస్తోంది. మరి ఇలాంటివారి పట్ల అధికారుల వైఖరేంటో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications