ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇంటి స్థలాల పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేసారు. ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీ ఇళ్ల స్థలాలకు ఎంత మేర భూమి అవసరమవుతుందో గుర్తించాలని...సీఎం త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం పటిష్ఠంగా అమలు చేయటం పైన కీలక సూచనలు చేసారు.
ఇంటి స్థలాలపై సీఎం రివ్యూ: ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి స్థలాల పై సీఎం జగన్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పది రోజుల్లో హైలెవల్ రివ్యూకు నిర్ణయించారు. దీనికి సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డి రెవిన్యూ అధికారులకు మార్గదర్శకం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీ ఇళ్ల స్థలాలకు ఎంత మేర భూమి అవసరమవుతుందో పరిశీలన జరపాలని సిసిఎల్ఎ జి సాయిప్రసాద్కు సిఎస్ సూచించారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పది రోజుల్లో ఇదే అంశంపై సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించనున్నారని జవహర్రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ఆరోగ్య పథకం అమలుపైనా: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)ను మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఎస్ జవహర్రెడ్డి పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. మరో పది రోజుల్లో ఇహెచ్ఎస్ అంశంపై సిఎం సమీక్షిస్తారన్నారు. ఈ పథకం అమలు గురించి ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి వచ్చిన ప్రతిపాదనల అమలుకు చర్యలు తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్టి కృష్ణబాబు చెప్పారు.
మరికొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మెడికల్ రీయంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించామన్నారు.
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో: ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల ఇంటి స్థలాల విషయంలో ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో.. 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేసి, 20 శాతం రాయితీతో ప్లాట్లను అందిస్తోంది. ఈ ప్లాట్లు 200, 240 చదరపు గజాలుగా అందుబాటులో ఉండగా.. చదరపు గజానికి రూ.17,499గా ధరగా నిర్ణయించింది సీఆర్డీఏ.
ఒప్పందం అయ్యాక నెల లోపు మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు కూడా ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 31 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 0866-2527124 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications