రోహిత్ విద్యార్హతలపై తెలంగాణ పోలీస్ ఆరా, తల్లి విద్యార్హతలపై ఏపీ
గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తల్లి రాధిక విద్యార్హతల పైన ఏపీ ప్రభుత్వం ఆరా తీసింది. రెండు రోజుల క్రితం రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి రావెల కిశోర్... తల్లి, తమ్ముడికి ఒప్పంద ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో గురజాల పోలీసులు రాధిక విద్యార్హతల వివరాలను పరిశీలించారు. డాక్టరు బీఆర్ అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ చదివేందుకు గుంటూరులోని హిందూ కళాశాల స్టడీ సెంటర్లో 2000లో రాధిక ప్రవేశం పొందారు.
అనంతరం గురజాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటరులో పరీక్షలు రాస్తానని తన ప్రవేశాన్ని అక్కడకు బదిలీ చేయించుకున్నారు. మొదటి సంవత్సరం పరీక్ష ఫీజులు చెల్లించారు. అయితే పరీక్షలకు మాత్రం రాధిక హాజరు కాలేదని తెలుస్తోంది. ఆమె చదువును బట్టి ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చూస్తోంది.

మరోవైపు, రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి వివరాల సేకరణలో భాగంగా హైదరాబాద్లో పోలీసులు గుంటూరులో విచారణ నిర్వహించారు. రైలుపేటలోని కన్న ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో రోహిత్ పదో తరగతి చదివాడు.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని మాదాపూర్ ఏసీపీ రమణ కుమార్ పాఠశాల డైరెక్టర్ కన్న మాస్టారుతో పలు విషయాలపై చర్చించారు. రోహిత్ ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు పాఠశాలలో చదివాడు, కుల ధ్రువీకరణ పత్రం ఏమైనా ఉందా? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. 2004లో రోహిత్ తమ పాఠశాలలోనే పదో తరగతి పూర్తిచేశాడని డైరెక్టర్ చెప్పారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications