AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..!
ఏపీలో భారీ ఎత్తున పెన్షన్లు (pensions) తొలగిస్తున్నారని, కొత్త పెన్షన్లు సైతం ఇవ్వడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం (ap govt) స్పందించింది. రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఏయే పెన్షన్లు తొలగిస్తున్నారో ఆయన వెల్లడించారు. అలాగే పెన్షన్ల కోసం బడ్జెట్ సరిపోకపోతే ఎక్కడి నుంచి నిధులు తెస్తున్నారో కూడా ఆయన ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మృతిచెందిన, శాశ్వతంగా వలసవెళ్లిన పెన్షన్లు మాత్రమే రద్దయ్యాయని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు సిక్స్ స్టెప్ వ్యాలీడేషన్ పేరుతో 5 ఏళ్లలో ఏకంగా 11 లక్షలకు పైగా పెన్షన్లు రద్దు చేసి పేదల పొట్టగొట్టారని ఆయన మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన కాలంలో ఇష్టం వచ్చినట్టు పెన్షన్లు తొలగించారని, ఆ విధంగా కూటమి ప్రభుత్వ, 20 నెలల పాలనలో అన్యాయంగా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని మంత్రి తెలిపారు. పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి, ప్రతీ నెలా స్పౌస్ పెన్షన్ కోటాలో వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నెల నెలా స్పౌస్ పెన్షన్ లను మంజూరు చేస్తుంటే, ఏ ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

గత ప్రభుత్వం 2021-24 మధ్య కాలంలో బేవరేజెస్ కార్పొరేషన్ నుండి ₹18,472.59 కోట్లు ఖర్చు చేసిందని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ. 11 వేల 140.46 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ వారు ఇచ్చే నిధుల వివరాలు ప్రభుత్వ బడ్జెట్ లో చూపించడం లేదన్నారు. అలాగే సామాజిక భద్రతా పెన్షన్ ల కోసం 2026-27 ఆర్ధిక సంవత్సరంలో 27 వేల 719 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదించామని, పెన్షన్ లకు కావాల్సిన మరో రూ.5 వేల 766 కోట్ల రూపాయలను బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి తీసుకుంటామన్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications