Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి తీపికబురు.. ఏపీలో వారి ఖాతాల్లో డబ్బులు జమ!

ఏపీలో సంక్రాంతి పండుగకు నేతన్నలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పండుగకు ముందే వారి ఖాతాలలో నగదు జమ జమ చేయటం ప్రారంభించింది. నేడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఆప్కో)కు చెందిన 5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది.

వారి ఖాతాలలో డబ్బులు జమ
ఈ మొత్తాన్ని జనవరి 12, సోమవారం చేనేత సహకార సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నట్లు బీసీ సంక్షేమ, ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఆమె ఈ మేరకు ఆప్కో యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. నేతన్నలకు బాసటగా నిలవటానికి ఏపీ ప్రభుత్వం వారికి తమ వంతుగా ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు.

AP Govt credited cash in Weavers accounts Ahead of Sankranthi

నేతన్నల ఆప్కో బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
గత 2025 డిసెంబర్‌లో రూ. 2.42 కోట్ల బకాయిలు విడుదలైన విషయాన్ని మంత్రి సవిత గుర్తుచేశారు. ఇదే సమయంలో మళ్ళీ బకాయిలను నేడు విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలకు ప్రాచుర్యం కల్పించటం కోసం, నేతన్నలకు విజయవాడ కేంద్రంగా 1976లో ఆప్కో స్థాపించబడింది. ఈ సంస్థ చేనేత సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి, షాపుల ద్వారా, ఆన్‌లైన్ వేదికల ద్వారా అమ్మకాలు సాగిస్తుంది.

ఆప్కో సొసైటీలకు బకాయిలు చెల్లిస్తున్న ఏపీ సర్కార్
వస్త్రాలు కొనుగోలు చేసిన తర్వాత ఆప్కో తిరిగి నేతన్నలకు చెల్లింపులు చేయాలి. ఆ చెల్లింపులు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో నేతన్నలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో, ఇటీవలే ఆప్కో సొసైటీలకు బకాయిలు చెల్లించడం ప్రారంభించింది. సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో చేనేత సొసైటీల ఖాతాల్లో బకాయిల మొత్తాలను జమ చేసింది.

ఆప్కో ద్వారా నేతన్నల చేనేతలకు ప్రోత్సాహం
చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఆప్కో ద్వారా డోర్ డెలివరీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మార్కెటింగ్ పెంచడానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను నిర్వహిస్తోంది. ఆప్కో పట్టుచీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. నేతన్నలకు మద్దతుగా, చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరించాలని ఇదివరకే నిర్ణయించింది.

నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు
ఏపీలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కూటమి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అందులో ఒకటి. దీని కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ నిర్వాహకులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కూడా కల్పిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+