రాజ్యసభను తాకిన ఇంగ్లీషు మీడియం రచ్చ: నిర్ణయం మార్చుకోవాలి: కేంద్రం సూచించాలి..!
ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ల వ్యవహారం ఇప్పుడు రాజ్యసభను తాకింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజే టీడీపీ ఎంపీ కేశినేని ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి వైసీపీ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అమలు చేస్తున్నా..తెలుగు భాషకు ప్రాధాన్యత దక్కకుండా ఏపీ ప్రభుత్వం చూస్తుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కేంద్ర మంత్రి సైతం తాము తెలుగు భాష కోసం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుందీ వివరించారు. ఇప్పుడు, అదే అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.
ప్రస్తావించిన టీడీపీ..బీజేపీ సభ్యులు
వచ్చే ఏడాది నుండి ఏపీలో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అమలు చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించిన అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు..టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కోరారు. తెలుగు భాషలో చదివినవారు కూడా.. ఆ తర్వాత ఆంగ్లంలో ప్రావీణ్యం పొందారని ఎంపీలు గుర్తుచేశారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చేలా.. ఏపీ ప్రభుత్వానికి సూచించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎంపీలిద్దరూ విజ్ఞప్తి చేశారు. జీవోను సవరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు.

ముఖ్యమంత్రి మాత్రం అదే మాట మీద..
ఇదే అంశం మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పట్టుదలతో కనిపిస్తున్నారు. దీని మీద విమర్శలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ వ్యవహారం మీద స్పందనలో భాగంగానే పవన్ కళ్యాన్ ముగ్గురు భార్యలకు..నలుగురో అయిదుగురో పిల్లలున్నారు..వారు ఏ స్కూళ్లో చదువుతున్నారంటూ ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబు..వెంకయ్య నాయుడు పిల్లలు గురించి నిలదీసారు. ఇది..రాజకీయంగా రగడకు కారణమైంది. అయితే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ల అమలు కు ఆమోద ముద్ర వేసారు. అదే విధంగా తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా నిర్ణయించారు. ఇక, ఈ రోజు సైతం ముఖ్యమంత్రి ఏపీలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అమలు చేస్తామని..ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే వెళ్తామని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు.
-
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications