రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ కార్డులు... రేషన్ పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. రేషన్ కోసం స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. అదే సమయంలో రేషన్ పంపిణీ దుకాణాల ద్వారా నిర్వహిస్తోంది. ఇందు కోసం వేళల ను అమలు చేస్తోంది. షాపుల వద్దకు రాలేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డుల జారీ... మార్పులకు సంబంధించి ప్రభుత్వం వెసులు బాటు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సులువుగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులు బాటు కల్పించింది. దీంతో పాటుగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా వివరాలు మార్చుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. సచివాలయాల్లో సిబ్బంది బిజీగా ఉండటం వల్ల రేషన్ సేవలు పొందే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి చెక్ పెడుతూ సేవలను సులభతరం చేస్తూ ప్రభుత్వం తాజాగా మార్పులు తెచ్చింది. దీంతో ఇక నుంచి ఈ సేవలు వార్డు సచివాలయాల్లోనే కాకుండా మీ సేవ పోర్టల్ ద్వారా రేషన్ కార్డు సేవలు ఆన్లైన్ ద్వారా సులువుగా పొందవచ్చు. తొమ్మిది రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

రేషన్ సేవలను సులభతరం చేస్తూ
ఈ విధానం ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా సభ్యుల్ని తొలగించడం, కొత్త సభ్యులను చేర్చడం, కార్డు విభజన చేసుకోవడం, కార్డు స్వాధీనం, కార్డులో వివరాలు అప్డేట్, ఆధార్ లింక్ చేయడం, డూప్లికేట్ కార్డు పొందటం, రేషన్ షాపుల వివరాలు అప్డేట్ వంటి సేవలు మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలు సులువుగా పొందవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక అయితే ఇందుకోసం పలు నిర్ధారణ, ధృవీరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు జిరాక్సులు, ఫొటోలను అందించాలి. అదే విధంగా రేషన్ కార్డు వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటివి సమర్పించాలి. ఇక ఒక అడ్రస్ మార్పులు, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన పూర్తి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు నిర్దేశించలేదు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల ఆధారంగా రేషన్ కార్డు జారీ చేస్తారు.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications