ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు-త్వరలో జారీ..!
ఏపీలో వాహనదారులకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence), రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్ (Registration Certificate)ల విషయంలో ప్రభుత్వం (AP GOVT) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల్ని వాహనదారులకు జారీ చేస్తుండగా.. వాటి స్ధానంలో తక్కువ ఖర్చుతో మరో మార్పు తీసుకొస్తున్నారు. ఇది వెంటనే అమల్లోకి రాబోతోంది. దీంతో గతంలో జారీ అయిన కార్డుల స్ధానంలో వీటిని తీసుకునే అవకాశం కల్పించడంతో పాటు కొత్త కార్డుల్ని సైతం ఇదే విధానంలో జారీ చేయబోతున్నారు.
చిప్ స్దానంలో క్యూఆర్ కోడ్ కాార్డులు (Ap Govt)
కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసయిన తర్వాత జారీ చేసే స్మార్ట్ కార్డుల్ని గతంలో చిప్ ఆధారిత వ్యవస్ధలోకి మార్చారు. దీంతో ఈ స్మార్ట్ కార్డులపై చిప్ కనిపించేది. ఇందులోనే సదరు కార్డుకు సంబంధించిన డేటా అంటే స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు చిప్ స్ధానంలో క్యూఆర్ కోడ్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి డబ్బులు ఆదా కాబోతున్నాయి.

డబ్బులిచ్చినా రాని కార్డులు
గతంలో తీసుకొచ్చిన చిప్ ఆధారిత విధానంలో ప్రతీ ఆర్సీ లేదా డీఎల్ స్మార్ట్ కార్డు కోసం రూ.200 ఫీజు, పోస్టల్ ఛార్జీలు రూ.35 కలిపి రూ.235 ముందుగానే వసూలు చేసేవారు. కానీ కార్డులు మాత్రం ఇళ్లకు వచ్చేవి కావు. ఆ తర్వాత 2023 నుంచి వాహనదారుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మానేసి, కార్డులు జారీ చేయడం కూడా మానేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాగానే 2024 అక్టోబర్ 1 నుంచి మళ్లీ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు.

క్యూఆర్ కోడ్ జారీ ఇలా
చిప్ తో కూడిన కార్డుకు 115 రూపాయలు ఖర్చవుతుంటే క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డుకు 72 రూపాయలే ఖర్చవుతోంది. దీంతో పాటు చిప్ కార్డుల్లో డేటా రీడ్ చేయాలంటే మళ్లీ వాటికి రీడర్లు కొనాలి. క్యూఆర్ కోడ్ తో అయితే కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో లింక్ అయి ఉంటుంది. దీంతో క్యూఆర్ కోడ్ తో కార్డులే ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2024 అక్టోబర్ 1 నుంచి ఇవ్వాల్సిన కార్డుల్ని జారీ చేస్తారు. అలాగే అంతకు ముందు కార్డులు కావాలంటే తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications