Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ, చంద్రబాబు కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. రైతులు.. మహిళలకు ఉగాది కానుక గా రెండు కీలక అంశాలను వెల్లడించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి అనేక అంశాలను ప్రస్తావించారు. అధికారులకు దిశా నిర్దేశం చేసారు. అందులో భాగంగా రైతులు... మహిళలకు ఉగాది కానుకగా వారి ఖాతాల్లో నిధులు జమ చేయటంతో పాటుగా.. కొత్త ఇళ్ల గృహ ప్రవేశాలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ కానున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు.. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 13 అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. 2 లక్షల 50 వేల ఇళ్ళు గృహ ప్రవేశాలు ఉగాదికి ఉంటాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ,ఇళ్లుఈ రెండు ఉగాది కానుకలుగా పేర్కొన్నారు. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు మరో 2 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. పీఎం కిసాన్​ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానుండగా అదే రోజున ఏపీ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని, నిధులు విడుదల చేయనున్నారు.

ap-govt-to-credit-annadata-sukhibava-funds-in-farmers-accounts-on-13th-of-this-month-here-the-detai

కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు

3వ విడత కింద రాష్ట్రంలో 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6000 చొప్పున మొత్తం రూ.2,808 కోట్లు అందనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 చొప్పున జమ చేస్తాయి. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రాష్ట్రం నుంచి రూ.14,000, కేంద్రం రూ.6 వేలు ఇవ్వనున్నారు. పీఎం కిసాన్​-అన్నదాత సుఖీభవ 3వ విడత కింద రూ.20,000 చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2 విడతల్లో రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు రూ.14,000 చొప్పున మొత్తం రూ.6,309.44 కోట్లు జమ చేసింది. మిగిలిన రూ.6000 ఈనెల 13న జమ చేస్తారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని వెల్లడించారు. ఎక్కడా భూ వివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలని నిర్దేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+