ఏపీ వైద్యశాఖలో కొత్తగా 426 ఉద్యోగాల భర్తీ - నర్సింగ్ విద్యాసంస్ధల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.
ఏపీలో వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం నాడు-నేడు పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జోరుగా సాగుతుండగా.. వీటిలో కొత్తగా ఉద్యోగాల కల్పనకూ తెరతీసింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా పనిచేస్తున్న నర్సింగ్ కళాశాలల్లో కొత్తగా 426 పోస్టులను సృష్టించనున్నారు. ఇందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని గుంటూరు జీజీహెచ్, శ్రీకాకుళం రిమ్స్, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కళాశాలల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే ఒంగోలు రిమ్స్, తిరుపతి ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న నర్సింగ్ స్కూళ్లలో మరో 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను త్వరలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది.

వీటిని రెగ్యులర్, ప్రమోషన్, ఔట్ సోర్సింగ్ విధానాల్లో భర్తీ చేసుకునేలా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏయే పోస్టులను ఎలా భర్తీ చేసుకోవచ్చో కూడా ఉత్తర్వుల్లో విడివిడిగా పేర్కొంది.
వీటి భర్తీ కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఔట్ సోర్సింగ్ పోస్టులను కార్పోరేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications