AP Govt: బిల్ గేట్స్ అండతో ఏపీ సర్కార్ ప్రాజెక్టు- 72 లక్షల మందికి మేలు..!
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చే లక్ష్యంతో కూటమి సర్కార్ (ap govt) వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించే లక్ష్యంతో రూపొందించిన సంజీవని ప్రాజెక్టును అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామిగా ఉంది.
ఇవాళ కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను చంద్రబాబు సందర్శించారు. ఆ గ్రామంలోని ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను స్వయంగా పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు గురించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వివిధ అంశాలను తెలుసుకున్నారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యారోగ్య శాఖ రూపొందించిన డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వివిధ ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు నిపుణులైన వైద్యులతో పాటు ఔషధాలను ఇచ్చేలా సంజీవని ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

అత్యుత్తమ టెక్నాలజీ ద్వారా ప్రజల ఆరోగ్య అంశాలను పర్యవేక్షించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ సహకారంతో ఈ డిజినెర్వ్ సెంటర్ ద్వారా ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు అమలుతో పాటు మరిన్ని రంగాల్లో సహకారం అందించేందుకు త్వరలోనే బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని సీఎం వెల్లడించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంజీవని చిత్తూరు జిల్లాకు విస్తరించామని .. ఈ ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించి స్కోరింగ్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం వివరించారు. 42 రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.

డయాబెటిస్, బీపీ, అనీమియా, హృద్రోగం తదితర అనారోగ్య సమస్యలకు సంబంధిత వైద్య నిపుణులతో ఔషధాలను ఇప్పించటంతో పాటు ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. త్వరలో వైద్య సలహాల కోసం ఏఐ డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. డిజి నెర్వ్ సెంటర్ ద్వారా ఒక్క క్లిక్ తోనే వైద్యులు రోగులకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునేందుకు అవకాశం ఉందన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా నమోదు చేసిన తుమ్మిశి గ్రామస్థుల డిజిటల్ హెల్త్ రికార్డులను వారి ఆరోగ్య వివరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొందరు అనీమియా లోపంతో బాధపడుతున్న మహిళలు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటున్న వారితో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించటంతో పాటు వైద్య నిపుణుల సేవలు అందేలా చూడాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications