ఉండవల్లి పిల్ పై హైకోర్టులో ట్విస్ట్ ! సీజే బెంచ్ నాట్ బిఫోర్ మీ-మరో బెంచ్ కు మార్పు..!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తాజా పరిణామాల నేపథ్యంలో సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలుచేసిన పిల్ పై హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్ పై విచారణకు సిద్దమైన ఛీఫ్ జస్టిస్ బెంచ్.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో చోటు చేసుకున్నస్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావని అంతకు ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణకు సిద్ధమైన ఛీఫ్ జస్టిస్ బెంచ్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తమ బెంచ్ లో ఒకరు ఈ పిటిషన్ విచారించేందుకు ఇష్టం లేదని, కాబట్టి నాట్ బిఫోర్ మీ ఆప్షన్ ద్వారా మరో బెంచ్ కు దీన్ని బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
తాజా పరిణామంతో ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పై హైకోర్టులో మరో బెంచ్ విచారణ జరపబోతోంది. ముందుగా ఉండవల్లి పిటిషన్ విచారణార్హతను తేల్చనున్న ధర్మాసనం.. విచారణ జరిపేందుకు అర్హత ఉందని తేలితే ముందడుగు వేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తదుపరి బెంచ్ విచారణ కూడా కీలకంగా మారబోతోంది. ఉండవల్లి పిటిషన్ కు విచారణ అర్హత ఉంటే హైకోర్టులో చంద్రబాబుకు మరిన్ని తిప్పలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. అదే సమయంలో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే చంద్రబాబు లాయర్లు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications