స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏ నంటూ మోసాలు- నకిలీగా తేల్చిన అధికారులు
ఏపీలో నకిలీల బెడద అంతకంతకూ పెరిగిపోతోంది. నకిలీ అధికారుల పేరుతో తాజాగా పలువురు వీఐపీలను బోల్తా కొట్టిస్తున్న వ్యవహారాలు వెలుగు చూస్తుండగా.. ఇదే కోవలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏగా చెప్పుకుంటూ సోమేశ్వరరావు అనే వ్యక్తి పలు మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం స్పందించింది.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకుంటూ సోమేశ్వరరావు అనే వ్యక్తి పలు మోసాలకు పాల్పడుతున్నాడు. నకిలీ గుర్తింపు కార్డు ధరించి ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుగుతూ అధికారులు, సిబ్బందిని ప్రలోభపెడుతున్నట్లు తెలిసింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సోమేశ్వరరావు దందాపై తమకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సోమేశ్వరరావుకు అసెంబ్లీ కార్యాలయంతో కానీ అధికారులు, స్పీకర్తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.

సోమేశ్వరరావు అనే వ్యక్తి ప్రభుత్వ అధికారులను ప్రలోభపెడుతూ పనులు చక్కబెట్టుకుంటున్నాడు. దీంతో సోమేశ్వరరావు వలలో పడొద్దని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications