RK Roja : పాజిటివ్ ఎనర్జీ కోసం అక్కడికి వెళ్లిన రోజా ? తప్పదంటున్న ఏపీ మంత్రి
ఏపీలో గతంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ నేతగా పనిచేసి ఆ తర్వాత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి అదే ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో మంత్రిగా కూడా ఎదిగిన నేత ఆర్కే రోజా. ఆమె ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. గతంలో జబర్దస్త్ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ పనిచేసిన రోజా.. మంత్రి అయ్యాక మాత్రం వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే తన వ్యాఖ్యలతో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే క్రమంలో వైజాగ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఏపీ క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజా ఇవాళ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శారదా పీఠంలో శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారిని కూడా రోజా దర్శించుకున్నారు. శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందినట్లు రోజా తెలిపారు. అంతటితో ఆగకుండా వైజాగ్ శారదా పీఠాన్ని తాను దర్శించుకోవడం వెనుక కారణాన్ని రోజా బయటపెట్టారు. దీంతో ఇప్పుడు రోజా వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

తాను దేవాలయాలకు ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ కోసం వెళుతుంటానని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాన కారణం సినీ, రాజకీయ నాయకులపై అనేకమంది నెగెటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ నెగెటివ్ ఎనర్జీ పోవాలంటూ తరచూ భగవంతుడిని దర్శించుకోవాలని రోజా తెలిపారు. ఇందుకోసమే తాను శారదా పీఠానికి వచ్చినట్లు రోజా పేర్కొన్నారు.
-
విజయ్ విడాకుల రచ్చ వేళ.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్ !! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
ఏపీలో మహిళా దినోత్సవ కానుక-ఈ 3 పథకాల ప్రారంభం..! -
సీఎం రేవంత్ దంపతులను కలిసిన నటి రష్మిక.. -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
ఖాళీ కడుపుతో ఉసిరి పౌడర్ కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోండి చాలు..!! -
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే ? -
దేశవ్యాప్తంగా "అన్నదానం".. "విరోష్" జంట బిగ్ డిసిషన్..! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్












Click it and Unblock the Notifications