విశాఖ మీదుగా అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే..కేంద్రం ముందుకు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ పారిశ్రామిక ప్రగతికి దోహదం చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఆవిర్భావంతో కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కార్ కేంద్రం సహకారంతో రాష్ట్రంలో హైవేలు అభివృద్ధి చేస్తూ నూతన ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది.
ఏపీలో కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే
ఈ క్రమంలో వివిధ మార్గాలలో అవసరాన్ని బట్టి అనేక కొత్త కీలక ప్రణాళికలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఖరగ్ పూర్, కటక్, విశాఖపట్నంల నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. 446 కిలోమీటర్ల కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తే మెరుగైన రవాణా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కలకత్తా చెన్నై జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ హైవే
నిత్యం రద్దీగా ఉండే కలకత్తా చెన్నై జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా సరుకు రవాణాను సులభతరం చేయడానికి ఇది నిర్మించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే కృష్ణ, ఏలూరు, పోలవరం, చింతపల్లి, పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా వెళుతుంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు ఇది అనుసంధానం చేసి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.
అమరావతిని కీలక లాజిస్టిక్స్ హబ్ గా మార్చే హైవే
రోడ్లు భవనాల శాఖ అధికారులు దీనికి సంబంధించిన డి పి ఆర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ డి పి ఆర్ కేంద్రం ఆమోదం పొందిన తర్వాత టెండర్లను పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కీలక లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దడంలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కీలకం కానుంది.
ఒంగోలు కత్తిపూడి మధ్య జాతీయ రహదారి
ఇది మాత్రమే కాదు ఒంగోలు కత్తిపూడి మధ్య ఉన్న జాతీయ రహదారి 16 కి ప్రత్యామ్నాయంగా చీరాల మీదుగా వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసల కు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ రెండు ప్రాజెక్టులు అమరావతికి కీలకం కానున్నాయి.
తుది దశకు విశాఖపట్నం రాయపూర్ జాతీయ రహదారి
కాగా ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న విశాఖపట్నం రాయపూర్ జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి వస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ హైవేల విస్తరణపైన ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపట్టింది.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications