రేషన్ వాహనాలపై ఇవాళ నిమ్మగడ్డ కీలక నిర్ణయం- ఎస్ఈసీ కార్యాలయంలో తనిఖీ తర్వాత
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై ప్రభుత్వం ముద్రించిన బొమ్మలు ఉండటంతో హైకోర్టు ఆధేశాల మేరకు వీటిని పరిశీలించాక ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీల్లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఈసీ పరిశీలన తర్వాత వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి వీటిని తనిఖీలు చేశాక తుది నిర్ణయం తీసుకోవాలని నిమ్మగడ్డ నిర్ణయించారు.

ఇవాళ ఉదయం రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి తీసుకొస్తారు. అనంతరం వాటిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం వాటికి అనుమతిచ్చే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. తనిఖీల్లో ఇవి వైసీపీ ప్రచారానికి ఉపయోగపడతాయని భావిస్తే వాటిని నిలిపేసే అవకాశాలూ లేకపోలేదు. అప్పుడు తిరిగి హైకోర్టుకు ఇదే విషయం నివేదించి ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications