ఛార్జీల పెంపు: 20 శాతం, ఆటోలతో సమానంగా...!
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ త్వరలో ఛార్జీలు పెంపునకు రంగం సిద్ధం చేసింది. ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా, ఆర్టీసీని ఆర్ధిక భారం నుంచి కాపాడాలన్నా ఇదే మార్గమమని యాజమాన్యం నిర్ణయించింది. పల్లె వెలుగు బస్సుల నుంచి ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీ, గరుడ, వెన్నెల వరకు అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచాలని యజమాన్యం యోచిస్తోంది.
ఈ ఛార్జీల పెంపు 20 శాతంగా ఉండబోతోంది. ఈ ఛార్జీల పెంపుపై రానున్న మాడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఉన్నాతాధికారి తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి అయిన తర్వాత ఏ ఛార్జీల పెంపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు.

ఛార్జీల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే ప్రయాణీకులపై రూ. 838 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ కార్మికులు ఇటీవల జరిపిన సమ్మెతో సంస్ధపై ఏటా దాదాపు రూ.960 కోట్ల భారం పడుతోందని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ వేల కొట్లలో అప్పుల్లో ఉండటం, ప్రతి ఏడాది నష్టాలు వస్తుండటంతో ఈ ఛార్జీల పెంపు తప్ప, మరో మార్గం లేదని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ఛార్జీలు పెంచలేదని అన్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, సంస్థను నడపాలన్నా ఛార్జీలు పెంచక తప్పదని అన్నారు. దూరప్రాంతాలు, గ్రామాల మధ్య తిరుగుతున్న ఆటోల్లో కిలోమీటరుకు సగటున 80, 90 పైసల వరకు ఛార్జీ వసూలు చేస్తున్నారు.
పల్లెవెలుగు బస్సుల్లో అది కిలోమీటరుకి 59 పైసలే ఉందని అన్నారు. ఆటోలతో సమానంగా పల్లెవెలుగు బస్సుల్లో ఛార్జీలు ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయాణికులకు మంటి సీట్లతో పాటు వినోదం కలిగించేందుకు ఆడియో ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications