కరోనా ఉధృతితో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం .. బస్సులు ఎక్కాలంటే ఆ రూల్స్ పాటించాల్సిందే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరోమారు పెరుగుతున్న తీరు రాష్ట్రంలో ఆందోళనకరంగా మారింది. పెరుగుతున్న కరోనా కేసులతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో కరోనా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి అందరూ పాటించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది . ఇదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

బస్సు ఎక్కాలంటే మాస్కు మస్ట్ .. కరోనా రూల్స్ పాటించాలని ఆదేశం
ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తుంది. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, మాస్కులు ధరించి లేకుంటే బస్సులోకి అనుమతించేది లేదని తేల్చి చెబుతోంది. అలాగే బస్టాండ్లలో, బస్సులో శానిటైజర్ లను ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ లో ఉన్న స్టాల్స్ లో మాస్కుల విక్రయాన్ని చేపడతామని, ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. కండక్టర్లు, డ్రైవర్లు కూడా కరోనా నిబంధనలు పాటించాలని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

కరోనా నియంత్రణపై మంత్రి ఆళ్ళ నానీ సమీక్ష .. అధికారులకు కీలక సూచనలు
ఇక తాజాగా కరోనా నియంత్రణపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు . విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల డిఎంహెచ్ఓ లతో మాట్లాడారు. కేసులు ఎక్కువగా పెరుగుతున్న జిల్లాలలో కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు .ఇదే సమయంలో జిల్లాలకు సర్వే టీమ్ లను పంపాలని పేర్కొన్నారు.మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్నందున బోర్డర్లో ఉన్న చిత్తూరు జిల్లాలో కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆళ్ల నాని స్పష్టం చేశారు.

మాస్కులు లేకుండా రోడ్ల మీదకు వస్తే కష్టమే .. బస్సుల్లో సైతం కరోనా కట్టడికి యత్నం
తిరుపతి రుయా, స్విమ్స్ లో కరోనా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కరోనా నిబంధనను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 500 రూపాయలు , పట్టణాల్లో వెయ్యి రూపాయలు మాస్కులు ధరించాకుంటే వెయ్యాలని ఏపీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు . రోడ్డు మీద మాస్కులు లేకుండా కనిపించే వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు .తాజాగా బస్సుల్లో సైతం కరోనా వ్యాప్తి జరగకుండా కీలక జాగ్రత్తలు పాటించనున్నారు .
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications