APSRTC : వైజాగ్ నుంచి ఒడిశాకు 7 అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు-టైమింగ్స్ ఇవే...!
ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన ఒడిశాకు కొత్తగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఒకటీ అరా సర్వీసులు ఉండగా.. వాటి స్ధానంలో రెగ్యులర్ గా రాకపోకలు సాగించేలా కొత్త సర్వీసుల్ని ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి ఒడిశా మధ్య రాకపోకలు సాగించే ఏడు అంతర్ రాష్ట్ర సర్వీసుల్ని, వాటి సమయాల్ని స్టాపుల్ని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఏపీ నుంచి ఒడిశా మధ్య నడిచే ఏడు అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలి బస్సు ఇవాళ ఉదయం విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం, సాలూరు మీదుగా ఒడిశాలోని జైపూర్ కు బయలుదేరింది. ఈ బస్సు రాత్రి 8 గంటలకు జైపూర్ చేరుకోనుంది. రెండో సర్వీసు విశాఖ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి విజయనగరం, సాలూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నవరంగ్ పూర్ చేరుకోనుంది. మూడో సర్వీసు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి ఎస్.కోట, అరకు మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఒనకఢిల్లీ చేరుకోనుంది.

నాలుగో సర్వీసు విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం, పాతపట్నం మీదుగా పర్లాకిమిడికి మధ్యాహ్నం 3.15 గంటలకు చేరుకోనుంది. ఐదో సర్వీసు విశాఖలోని కూర్మన్నపాలెం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం, పర్లాకిమిడి మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు గుణుపూర్ చేరుకోనుంది. ఆరో సర్వీసు విశాఖపట్నంలోని సింహాచలం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు బయలుదేరి రాజాం, పాలకొండ, కొత్తూరు, హడ్డుబంగి మీదుగా గుణుపూర్ కు తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు చేరుకోనుంది. ఏడో సర్వీస్ విశాఖలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి విజయనగరం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం మీదుగా గుణుపూర్ కు తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుకోనుంది.
ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఈ అంతర్ రాష్ట్ర సర్వీసుల్ని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ బస్సుల్లో టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ తర్వాత తిరిగి పుంజుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పొరుగు రాష్ట్రాలకు అంతర్ రాష్ట్ర సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications