వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఇఫ్తార్కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 12 వేల మంది ముస్లింలు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు వేల ముస్లిం మత పెద్దలను ఆహ్వానించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఇఫ్తార్ కావడంతో ఎక్కడా, ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కడపలోని అమీన్పీర్ దర్గా పెద్దలతో పాటు నాలుగు వేలమంది వరకు మౌల్వీలు, మసీదు కమిటీల ఛైర్మన్లు, వక్ఫ్ బోర్డు ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications