నాలుగు రోజుల్లో ఏపీకి శుభవార్త: జైట్లీ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభావార్త ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నాలుగు రోజులు ఆగితే, ఏపీకి శుభవార్త వస్తుందని చెప్పారు. గురువారం నాడు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు.
అరుణ్ జైట్లీ ప్రసంగిస్తుండగా ఏపీ రెవెన్యూలోటు మాటేమిటని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ప్రశ్నించారు. దీంతో అరుణ్ జైట్లీ స్పందించారు. ఏపీలో రెవెన్యూ లోటు ఉన్న విషయం తెలుసన్నారు. ఏపీకి శుభావార్త ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, శనివారం అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

కాగా, కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఏపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో చేస్తున్నామని చెబుతూ వచ్చిన టీడీపీ, బీజేపీ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకేం సమాధానం చెబుతాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏపీకి ఏ విధమైన కేటాయింపులు, కొత్త లైన్లు, పెండింగ్ పనులకు నిధుల ప్రస్తావన లేకుండా కేంద్రం ద్రోహం చేసిందని, అలాంటి వారితో సీఎం చంద్రబాబు చేతులు కలిపారని రఘువీరా అన్నారు. రైల్వే బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. రైల్వే బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఏపీ మంత్రులు కూడా చెబుతున్నారు.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications