రైల్లో చోరీకి యత్నం: గాలిలోకి పోలీసు కాల్పులు

చెన్నై నుంచి గౌహతి వెళ్లే గౌహతి ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ -1 బోగీలో దొంగలు చైన్ లాగి రైలును ఆపేశారు. రైలులో భద్రత కోసం ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ సుభానీ, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులను గమనించిన దొంగలు రైలులో నుంచి దూకి పరారయ్యారు
దొంగలను పోలీసులు వెంబడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే, దోపిడీ దొంగలు తప్పించుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత రైలు ప్రయాణం సాగించింది.
చెన్నైకి చెందిన దొంగల ముఠా ఈ ప్రయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే అసిస్టెంట్ కమిషనర్ పొన్నురాజు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు, గూడూరు ఆర్పిఎఫ్ ఎస్ఐలు రవిశంకర్, అర్జునరావు, స్థానిక ఎస్ఐ నగేష్ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications