మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
మైనర్ బాలికపై విజయనగరం జిల్లాలో ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. స్కూల్ నుండి ఇంటికి ఆటోలో తిరిగివస్తుండగా ఆటోలో ప్రయాణీకులు ఎవరు లేని ప్రాంతంలో ఆటోడ్రైవర్ బాలికపై అత్యాచారం చేశాడు.
విజయనగనం :విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలోని ముసిరం గ్రామ సమీపంలో పదకొండేళ్ళ మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. నిందితుడి నుండి తప్పించుకొని వచ్చిన బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాదితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడికోసం గాలిస్తున్నారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ముసిరం గ్రామానికి సమీపంలో పదకొండేళ్ళ మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు.లక్కవరపుకోట మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన బాలిక కొత్తవలస మండలంలోని ఓపి జిందాల్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతోంది.
పాఠశాల నుండి ఇంటికి వచ్చేందుకు మంగళవారం సాయంత్రం అనకాపవల్లి వైపు వెళ్ళే ఆటోను ఎక్కింది. ముసిరం గ్రామం వద్దకు చేరుకొనేసరికి ఆటో లోని ప్రయాణీకులంతా దిగిపోయారు. ఒంటరిగా ఉన్న బాలికపై ఆటో డ్రైవర్ బాలికపై అత్యాచారం చేశాడు.
అయితే నిందితుడి నుండి తప్పించుకొన్న బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. అయితే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే నిందితుడు లక్కవరపు కోట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.