బద్రి అంతిమయాత్ర: భర్తను చూసి బోరుమన్న భార్య
విజయవాడ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్ బద్రి అంతిమయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య లక్ష్మీసుజాతకు బంధువులు బద్రి మృతదేహాన్ని చూపించడంతో ఆమె బోరున విలపించారు.
ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ బద్రి అంతక్రియలు ఆయన సొంతూరులో ముగిశాయి. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో పలువురు మంత్రులు బద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా బద్రి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పల్లె రఘునాథరెడ్డి రూ. లక్ష, రూ. 20వేలు బద్రి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు.

ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో టీవీ9 చానెల్ న్యూస్ రీడర్ బద్రి మృతి చెందిన విషయం తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీసుజాత కూడా గాయపడ్డారు. బద్రి పెద్దకుమారుడు సాయి సందీప్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని వెంటలేటర్పై ఉంచినట్లు సమాచారం. ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మరణించగా, చిన్న కుమారుడు సాయి సాత్విక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
లక్ష్మీసుజాత చెయ్యి విరగడంతోపాటు ఆమె వెన్నుపూస వద్ద బలమైన గాయమైంది. ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెదడుకు దెబ్బ తగిలి, పుర్రె ఎముక ఫ్రాక్చర్ కావడంతో పెద్ద కుమారుడికి వెంటిలేటర్పై చికిత్సనందిస్తున్నారు. బద్రి బావమరిది గండ్రోతు తారక్కు కూడా తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
బద్రి అమ్మమ్మ ఊరు ఆవపాడు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత తండ్రి ఉద్యోగ రీత్యా ఉంగుటూరులో నివాసం ఉన్నారు. ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు. ఆవపాడులోని మేనమామ కుమార్తె లక్ష్మీసుజాతను వివాహం చేసుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications