24న చీపురుపల్లి పర్యటన: బొత్సకు సవాల్ విసుకుతున్న బాలయ్య
విజయనగరం: బొబ్బిల రాజులు తమ పార్టీలో చేరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసరడానికి సిద్ధపడ్డారు. ఆయన ఈనెల 24వ తేదీన విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాబోతున్నారు.
ఆ తర్వాత స్థానిక బస్టాండ్ జంక్షన్ వద్ద ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత స్థానిక నటరాజ్ థియేటర్లో ఆయన నటించిన డిక్టేటర్ సినిమా శత దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. చీపురుపల్లి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణకి పెట్టని కోటవంటిది.

అక్కడ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, బాలకృష్ణ పర్యటన, బహిరంగ సభ నిర్వహించడం బొత్సకు సవాల్ విసురుతున్నట్లుగానే భావిస్తున్నారు. బాలకృష్ణ చీపురుపల్లి పర్యటనలో వైసిపికి చెందినవారెవరూ టిడిపిలో చేరలేదు.
కానీ, సుజయ కృష్ణ రంగారావు వచ్చి ఆయనతో కలిసి ఆ కార్యక్రమాలలో పాల్గొంటే తప్పకుండా పరిస్థితి మారుతుందని అంటున్నారు. సుజయకృష్ణ రంగారావు రాకపోయినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చీపురుపల్లిలో మోహరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications