24న చీపురుపల్లి పర్యటన: బొత్సకు సవాల్ విసుకుతున్న బాలయ్య
విజయనగరం: బొబ్బిల రాజులు తమ పార్టీలో చేరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసరడానికి సిద్ధపడ్డారు. ఆయన ఈనెల 24వ తేదీన విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాబోతున్నారు.
ఆ తర్వాత స్థానిక బస్టాండ్ జంక్షన్ వద్ద ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత స్థానిక నటరాజ్ థియేటర్లో ఆయన నటించిన డిక్టేటర్ సినిమా శత దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. చీపురుపల్లి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణకి పెట్టని కోటవంటిది.

అక్కడ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, బాలకృష్ణ పర్యటన, బహిరంగ సభ నిర్వహించడం బొత్సకు సవాల్ విసురుతున్నట్లుగానే భావిస్తున్నారు. బాలకృష్ణ చీపురుపల్లి పర్యటనలో వైసిపికి చెందినవారెవరూ టిడిపిలో చేరలేదు.
కానీ, సుజయ కృష్ణ రంగారావు వచ్చి ఆయనతో కలిసి ఆ కార్యక్రమాలలో పాల్గొంటే తప్పకుండా పరిస్థితి మారుతుందని అంటున్నారు. సుజయకృష్ణ రంగారావు రాకపోయినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చీపురుపల్లిలో మోహరించే అవకాశం ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications