బియాస్ ట్రాజెడీ: మరో నాలుగు మృతదేహాలు లభ్యం
హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్లోని బియాన్ నదిలో ఆదివారం నాలుగు మృతదేహాలు లభించాయి. మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించింది. వారిని హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రుత్విక్తో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట, గీర్మాజీపేటలకు చెందిన పరమేశ్వర్, మిట్టపల్లి అఖిల్తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్లుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తల్లిదం డ్రులకు తెలియజేసిన అధికారులు ఈ రాత్రికి మృతదేహాలను హైదరాబాద్కు తరలి స్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 8న నగర శివారుల్లోని బాచుపల్లికి చెందిన విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఉత్తరప్రదేశ్లోని బియాన్ నదికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రమాదవశాత్తూ డార్జీ డ్యాం నుంచి అక్కడి అధికారులు నీటి ని వదలడంతో ఫోటోల కోసం నదిలోకి దిగిన విద్యార్థులు ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృ తికి 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంతో చర్చించి సహాయక చర్యలను తక్షణమే చేపట్టేలా చేశాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులను కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గాలింపు చర్యల్లో మొదటి మూడు రోజుల పాటు దాదాపు 9 మం ది విద్యార్థుల ఆచూకీ లభించింది. ఆ తర్వాత గాలింపు చర్యలు మందగించడం, గాలింపునకు పలు రకాల ఆటంకాలు ఏర్పడడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను తమకు అప్పగించడంతో హిమాచల్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా అక్కడే వున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఇక తమ పిల్లల ఆచూకీ లభించేలా లేదని అనుమానించి అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు.
గత మూడు రోజులుగా వరుసగా విద్యార్థుల మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో మరో ఎనిమిది మృతదేహాల ఆచూకీ లభించింజి. దీంతో ఇప్పటి వరకు 17 మంది విద్యార్థుల ఆచూకీ లభించగా ఇంకా ఏడుగురు విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి వుంది.

హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్లోని బియాన్ నదిలో ఆదివారం నాలుగు మృతదేహాలు లభించాయి. మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించింది. వారిని హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రుత్విక్తో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట, గీర్మాజీపేటలకు చెందిన పరమేశ్వర్, మిట్టపల్లి అఖిల్తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్లుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తల్లిదం డ్రులకు తెలియజేసిన అధికారులు ఈ రాత్రికి మృతదేహాలను హైదరాబాద్కు తరలి స్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 8న నగర శివారుల్లోని బాచుపల్లికి చెందిన విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఉత్తరప్రదేశ్లోని బియాన్ నదికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రమాదవశాత్తూ డార్జీ డ్యాం నుంచి అక్కడి అధికారులు నీటి ని వదలడంతో ఫోటోల కోసం నదిలోకి దిగిన విద్యార్థులు ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృ తికి 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంతో చర్చించి సహాయక చర్యలను తక్షణమే చేపట్టేలా చేశాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులను కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గాలింపు చర్యల్లో మొదటి మూడు రోజుల పాటు దాదాపు 9 మం ది విద్యార్థుల ఆచూకీ లభించింది. ఆ తర్వాత గాలింపు చర్యలు మందగించడం, గాలింపునకు పలు రకాల ఆటంకాలు ఏర్పడడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను తమకు అప్పగించడంతో హిమాచల్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా అక్కడే వున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఇక తమ పిల్లల ఆచూకీ లభించేలా లేదని అనుమానించి అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు.
గత మూడు రోజులుగా వరుసగా విద్యార్థుల మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో మరో ఎనిమిది మృతదేహాల ఆచూకీ లభించింజి. దీంతో ఇప్పటి వరకు 17 మంది విద్యార్థుల ఆచూకీ లభించగా ఇంకా ఏడుగురు విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి వుంది.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications