ఆలయానికి రూ.1.2 లక్షలు ఇచ్చిన బిచ్చగాడు, అన్నదానం కూడా..
విజయనగరం జిల్లాలో ఓ యాచకుడు ఓ గుడికి రూ.1.2 లక్షల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణానికి అతను అందించాడు. ఆ గుడి శివాలయం. యాచకుడి పేరు కామరాజు.
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఓ యాచకుడు ఓ గుడికి రూ.1.2 లక్షల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణానికి అతను అందించాడు. ఆ గుడి శివాలయం. యాచకుడి పేరు కామరాజు.
అతను జిల్లాలోని చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయం ఆవరణలో దశాబ్దాలుగా యాచన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ గుడికే విరాళం ఇచ్చాడు.
ఆలయ ఆవరణలో షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. షెడ్లు లేక భక్తులు ఎండలో నిలబడాల్సి వస్తోందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

కమిటీ నిర్ణయం తెలుసుకున్న కామరాజు వాటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.1.2 లక్షలు తాను ఇస్తానని చెప్పాడు. బ్యాంకు నుంచి రూ.60 వేలు తీసుకొచ్చి గుడి పెద్దలకు అందించాడు. మొత్తం డబ్బును ఒకేసారి అధికారులు ఇవ్వడానికి నిరాకరించడంతో అతను మిగతా సొమ్మును మరో ఒకటి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పాడు.
అంతేకాదు, షెల్టర్లు పూర్తయ్యాక పది వేల రూపాయలు ఖర్చు చేసి అన్నదానం చేస్తానని చెప్పాడు. ఆయన ఆరు దశాబ్దాలుగా ఏళ్ల క్రితం చీపురులల్లి వచ్చి, శివాలయం వద్దే ఉంటూ, యాచిస్తున్నాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications