నేనోడితే 1,116, నువ్వోడితో కోటి: జెసి, పాల్వాయి పందెం

ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష కార్యాలయంలో బుధవారం ఎదురుపడ్డారు. ఈ సమయంలో వారి మధ్య వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు జయాపజయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పాల్వాయి అన్నారు. దీనిపై స్పందించిన జెసి అధికారంలోకి రావడం కల్ల అన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెసు అధికారంలోకి రాదని జెసి చెప్పారు. దీనిపై పాల్వాయి మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీ ఓడిపోతే తాను రూ.1,116 జెసి దివాకర్ రెడ్డికి ఇస్తానని, జెసి ఓడితే మాత్రం అంటే కాంగ్రెసు అధికారంలోకి వస్తే దానికి అదనంగా మరో కోటి రూపాయలు తనకు ఇవ్వాలని షరతు పెట్టారు.
పాల్వాయి షరతుకు జెసి దివాకర్ రెడ్డి అంగీకరించారు. రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెసు పార్టీ గెలవదని జెసి చెప్పారు. దానికి సమాధానంగా సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందా అని పాల్వాయి అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications