నేనోడితే 1,116, నువ్వోడితో కోటి: జెసి, పాల్వాయి పందెం
ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష కార్యాలయంలో బుధవారం ఎదురుపడ్డారు. ఈ సమయంలో వారి మధ్య వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు జయాపజయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పాల్వాయి అన్నారు. దీనిపై స్పందించిన జెసి అధికారంలోకి రావడం కల్ల అన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెసు అధికారంలోకి రాదని జెసి చెప్పారు. దీనిపై పాల్వాయి మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీ ఓడిపోతే తాను రూ.1,116 జెసి దివాకర్ రెడ్డికి ఇస్తానని, జెసి ఓడితే మాత్రం అంటే కాంగ్రెసు అధికారంలోకి వస్తే దానికి అదనంగా మరో కోటి రూపాయలు తనకు ఇవ్వాలని షరతు పెట్టారు.
పాల్వాయి షరతుకు జెసి దివాకర్ రెడ్డి అంగీకరించారు. రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెసు పార్టీ గెలవదని జెసి చెప్పారు. దానికి సమాధానంగా సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందా అని పాల్వాయి అన్నారు.