మహిళా రిజర్వేషన్లు సరిపోవు..! వారికి అవీ ఇవ్వండి.. సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో కీలకంగా వ్యవహరించి అనంతరం పార్టీ అధికారం కోల్పోయాక , పదవులకు , రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy).. ప్రస్తుతం దేశోద్ధారణ పనుల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఓవైపు వ్యవసాయం చేసుకుంటూ, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ, ఇంకోవైపు అంతర్జాతీయ విషయాలపై తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడిస్తూ సాయిరెడ్డి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి.. కేంద్రం త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై స్పందించారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేసేందుకు వీలుగా కేంద్రం ఈ నెలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సరిపోవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత కోసం ఇంకేం చేయాలో రాజకీయ పార్టీలకు సూచించారు.

Beyond reserving seats for women in the Lok Sabha and State Assemblies, we must also ensure greater representation of women in leadership positions within every registered political party. Real political empowerment will come when women hold decision-making roles inside parties…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2026
లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడమే కాకుండా, నమోదైన ప్రతి రాజకీయ పార్టీలోనూ నాయకత్వ పదవులలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం ఉండేలా తప్పక చూడాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. పార్టీలలో మహిళలు నిర్ణయాధికార పాత్రలు పోషించి, ఎన్నికైన పదవుల్లోకి సజావుగా మారడానికి మెరుగ్గా సిద్ధపడినప్పుడే నిజమైన రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని సాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఈ ట్వీట్ ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియలేదు. గతంలో తాను పనిచేసిన వైసీపీలో ఒకప్పుడు విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఇద్దరూ వ్యాపారాల్లో ఉన్నారు. వీరికి ఆయా పార్టీలు కీలక పదవులు ఇవ్వాలని సాయిరెడ్డి భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
-
వినలేని డ్రైవర్.. అంధురాలైన యువతి. నిశ్శబ్ద ప్రయాణంలో మానవత్వం -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!














Click it and Unblock the Notifications