జగన్ ఎవరు చెప్పినా వినరు, అందుకే ఇలా చేశా: భూమా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఎవరు చెప్పినా వినరని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లాలో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భూమా మాట్లాడారు. జగన్ ప్రతి విషయంలో ఏకపక్షంగా వ్యవహరించే వారన్నారు. ఏం చెప్పినా వినేవారు కాదన్నారు.
'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?
చంద్రబాబు పట్టుదలను చూసే తాను తెలుుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు. అనంతరం మండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడారు. ముచ్చుమర్రి లిఫ్ట్ శంకుస్థాపన వచ్చినప్పుడు ఇక్కడ ప్రాజెక్టు సాధ్యమా అన్న అనుమానం వచ్చిందన్నారు. కానీ చంద్రబాబు పట్టుదలతో పూర్తి చేశారన్నారు. ఇందుకు ఆయనకు జేజేలు అన్నారు.