మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠం భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న పెద్దిరెడ్డి అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ కేవీ. విశ్వనాథన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ అంశంపై నేడు విచారణ జరిపి తీర్పు వెల్లడించింది.
కాగా పెద్దిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. ధర్మాసనం తాము కేసు మెరిట్స్లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. "ఈ అంశం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. అందువల్ల అక్కడే తేల్చుకోవాలి," అంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం రెండు వారాలపాటు యథాతథ స్థితి (Status Quo) కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం హైకోర్టు ఆదేశాల తర్వాత కేసు మెరిట్స్ను పరిగణలోకి తీసుకుని తుది తీర్పు ఇవ్వవచ్చని తెలిపింది.

దాంతో ఇప్పుడు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం కీలకం కానుంది. ఈ పరిణామంతో బుగ్గమఠం భూముల వివాదం న్యాయపరంగా కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. రెండు వారాల యథాతథ స్థితి నేపథ్యంలో.. ఈ వ్యవహారం హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా కీలకమైన ఈ కేసులో పెద్దిరెడ్డికి ఊరట దక్కకపోవడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications