పొత్తుకు మెలిక మైండ్ గేమ్: జగన్కు బిజెపి నేతల ఝలక్
Recommended Video

అమరావతి: తమ పార్టీతో పొత్తుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మెలిక ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులకు రుచించనట్లు లేదు. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
జగన్ పెట్టిన మెలికపై బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి వెనువెంటనే ప్రతిస్పదించారు. ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడడం సరికాదని ఆమె అన్నారు. తాజాగా పలువురు బిజెపి నేతలు ప్రతిస్పందించారు.

జగన్ మైండ్ గేమ్..
బిజెపితో కలిసి పనిచేస్తామని వైయస్ జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అవినీతి పార్టీతో తాము ఎలా కలిసి పనిచేస్తామని ఆయన విశాఖపట్నంలో మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. టిడిపి, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు ఈ రెండు పార్టీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాని ఆయన అన్నారు. జగన్ కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి కామినేని ఇలా...
ఎపికి ప్రత్యేక హోదా ఇస్తా బిజెపితో కలుస్తానని జగన్ చేసన ప్రతిపాదినపై బిజెపి నేత, మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రతిస్పందించారు. అవినీతిపరుడైన జగన్తో బిజెపి కలిసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. టిడిపి, బిజెపి కలిసినందుకే ప్రజలు మద్దతు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని చెప్పారు .

సోము వీర్రాజు ఇలా....
ప్రత్యేక హోదాతో ఎన్నికల పొత్తులు, రాజకీయాలు ముడిపడి ఉండవని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పిన విషయంపై ఆయన ప్రతిస్పందించారు. ప్రత్యేక హోదాను అనుసరించి పొత్తులుండవని, అయినా తాము టిడిపితోనే న్నామని, విడిపోలేదని ఆయన అన్నారు.

భవిష్యత్తులో హోదా ఉండదని...
భవిష్యత్తులో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండదని, కమిషన్ల సిఫార్సుల వల్ల ఇకపై ఆ ప్రయోజనాల రావని, హోదా ఇచ్చే కమిటీ ఇప్పుడు లేదనే విషయం గుర్తించాలని సోము వీర్రాజు అన్నారు. రోజూ పత్రికలు చదవేవారికి ఆ విషయం తెలుసునని అన్నారు. రాష్ట్రానికి మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని, హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. మరో రెండు మూడు నెలల్లో 2,3 వేల కోట్లు ఇస్తారనే సమాచారం ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత మరో 4 వేల కోట్లు ఇస్తామని అంటున్నట్లు తెలిపారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications