టిడిపిని కాంగ్రెస్ కు స్టెప్నీగా మార్చిన చంద్రబాబు:బీజేపీ ఎంపీ సంచలనం
విజయవాడ:బిజెపి రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీకి స్టెప్నీగా మారారన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని ఇకపై తెలుగు కాంగ్రెస్ అనాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.
గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు టిడిపి ప్రభుత్వంపై,చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు...కాంగ్రెస్ పార్టీతో కలసితో జత కలిసి పార్లమెంట్ సమావేశాలను సరిగా జరగనివ్వకుండా అడ్డుపడ్డారన్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో టిడిపి హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని...వాటిపై సమాధానం చెప్పకుండా ప్రత్యేక హోదా ముసుగులో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అయితే వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని, ఎపికి కేంద్రం ఏమేం చేసిందో కూడా తేలుతుందని ఈ సందర్భంగా ఎంపి జివిఎల్ నరసింహారావు చెప్పడం గమనార్హం.
-
మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications