ఆంధ్రోళ్లకి సారీ చెప్పాకే ఏపీలో కేసీఆర్ ఎంట్రీ.. !?
గతంలో ఏపీ విభజన కాకముందు తెలంగాణ సాధన క్రమంలో ఆంధ్రోళ్లంతా పదే పదే వ్యాఖ్యలు చేసి ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురైన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీపై పోరు పేరుతో బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీ ప్రజలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తలవంచి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి డిమాండ్ చేశారుచ ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లపై కేసీఆర్ సిగ్గు పడుతున్నాను అని ప్రకటించి..అ తర్వాతే ఆంధ్రలో అడుగు పెట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర ప్రజలు స్వాగతించరన్నారు. ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అని జీవీఎల్ మండిపడ్డారు.

రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ కోరారు.లేదంటే కేసీఆర్ ను అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇప్పిస్తామని ప్రకటించారు. బీజేపీ నేతలు ఎవరు బీఆర్ఎస్లోకి వెళ్లే పరిస్థితి లేదని, గతంలో మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంత మంది బీఆర్ఎస్లోకి వెళ్లారని జీవీఎల్ తెలిపారు. కానీ అది తమ పార్టీ కి సంబంధం లేని విషయంగా చెప్పుకొచ్చారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications