రాజధాని ఎఫెక్ట్: మంగళగిరిలో బీఎండబ్ల్యూ షోరూం
అమరావతి: ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో తన తొలి షోరూంను ఘనంగా ప్రారంభించింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎకరం ధర కోట్ల రూపాయలు పలుకుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల క్రితం తుళ్లూరు ప్రాంతంలో టెంట్లు వేసి మరీ కార్ల, బైకుల అమ్మకాలు మొదలు పెట్టారు. ఇప్పుడు మంగళగిరిలో బీఎండబ్ల్యూ వంటి సంస్థ షోరూం ప్రారంభించడం గమనార్హం. మరిన్ని కార్ల షోరూంలు ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

'ఏపీకి ప్రత్యేక హోదా'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు గురువారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల తీరు చాలా దారుణంగా ఉందన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని పేరును అమరావతిగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి దానిని ప్రకటించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications