పవన్ కళ్యాణ్ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారు : బోత్స సత్యనారయణ
రాజధాని విషయంలో జనసేన అధినేత రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు.. రాజధాని నిర్మాణంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపి పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ హయాంలో జరిగిన జరిగిన అవకతవకలపై పవన్ కళ్యాన్ ఎందుకు ప్రశ్నించలేదని అయన అడిగారు.
ఇక గతంలో కూడ అమరావతి సామాన్యులదా లేక సంపన్నులదా గతంలో ప్రశ్నించలేదా అని అన్నారు. సీఆర్ఢీఏ పేరుతో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్లలో అవినీతీ అక్రమాలు జరిగాయాని బోత్స ఆరోపించారు.

మరోవైపు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సైతం రాజధాని విషయంలో పవన్ కళ్యాన్ యూటర్న్ తీసుకున్నారని అన్నారు. గతంలో రాజధాని ప్రాంతం అనుకూలం కాదని ప్రకటించిన పవన్ కళ్యాన్ మాటమార్చారని అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్నే పవన్ కళ్యాన్ సైతం తీసుకన్నారని ఫైర్ అయ్యారు. అమరావతి నిర్మాణంలో ఎలాంటీ గందరగోళం లేదని, అందులో ఉన్న కష్టనష్టాలను సరిచేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications