బొత్స ప్రకటన కలకలం: కాంగ్రెస్ను వీడేది వీరేనా?
హైదరాబాద్: తమ పార్టీ నుంచి 25 శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు వెళ్లిపోతారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎవరెవరు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మీడియా కూడా పరిణామాలను బట్టి ఎవరెవరు కాంగ్రెసుకు రాజీనామా చేసే అవకాశాలున్నాయనే విషయంపై కథనాలను ప్రచురిస్తోంది.
ముగ్గురు మంత్రుల్లో గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు ఇప్పిటికే బలమైన వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఏరాసు ప్రతాప రెడ్డి కూడా గోడ దూకే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో మంత్రిపై కూడా అంచనాలు సాగుతున్నాయి.

ఇక శాసనసభ్యుల విషయానికి వస్తే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లే. తాజాగా, ఆయన అనుచురుడైన శ్రీకాకుళం డిసిసి అధ్యక్షుడు నరేంద్రపై పిసిసి వేటు వేసింది. అనంతపురం, కడప జిల్లాల కాంగ్రెసు కమిటీల అధ్యక్షుల రాజీనామాలను కూడా ఆమోదించింది. దర్మాన ప్రసాదరావుతో పలాస శాసనసభ్యుడు జె. జగన్నాయకులు కూడా కాంగ్రెసు పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.
విజయనగరం జిల్లాలో సాలూరు శాసనసభ్యుడు పి. రాజన్నదొర ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ జిల్లాలో మరో శాసనసభ్యుడు కూడా పార్టీని వీడవచ్చుననే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నం జిల్లాలో గంటా శ్రీనివాస రావుతో పాటు మరో నలుగురు శానససభ్యులు కాంగ్రెసు పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది.
తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు పార్టీని వీడుతారని అంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుపుతున్నారు.
కాగా, అనంతపురం జిల్లాలో తాడిపత్రి శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పార్టీని వీడడం ఖాయమైంది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీకి దింపే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెసు పార్టీని వీడే అవకాశాలున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి వెళ్లిపోయే తాజా ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేస్తామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications