వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌లో...ఆడవాళ్లకూ అన్యాయం: నన్నపనేని రాజకుమారి

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ తో పాటు మహిళలకు కూడా అన్యాయం జరిగిందని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. అసలు బడ్జెట్‌లో మహిళా సంక్షేమం ప్రస్తావనే లేకపోవడం చాలా శోచనీయమని అన్నారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని అనేక రాష్ట్రాలలో మహిళలు...వ్యవసాయదారులుగా, కూలీలుగా ఉన్నారని...వారి గురించి కేంద్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా హామీల వూసే లేదని విమర్శించారు.

Budget were also unfair to women: Nannapaneni

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, ఇతరత్రా భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఎపిలో ఇతర దేశస్థులే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అలాంటి కేంద్రం కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమావేశాల్లోనే ఏపీకి నిధులు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

English summary
Nannapaneni Raja Kumari, the chairperson of the AP Women's Commission, alleged that the Union Government has been unfair in budget allocations to ap and women also. The central government didn't mention about women's welfare in the budget...she said...it was sad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X