మంటలకు ఆర్టీసి పుష్పక్ ఎసి బస్సు ఆహుతి
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ కూడలిలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీకి చెందిన పుష్పక్ ఏసీ బస్సు మంటలకు ఆహుతైంది. బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు.
వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. రాణిగంజ్ డిపోకు చెందిన ఈ బస్సు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎవరికీ ఏ విధమైన ప్రమాదం జరగలేదు.

బస్సు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రమాదం జరిగినప్పుడు నలుగురైదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. మంటలకు బస్సు పూర్తిగా ఆహుతి అయింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సు అగ్ని ప్రమాదానికి గురై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications