రేవంత్ ఇష్యూ: 'బాబు రాజీనామా చేస్తేనే, మోడీ మద్దతు ఇంకానా'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు కాగా, ఈ వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకూ పాత్ర ఉందన్న ఆరోపణల పైన విచారణ జరిపించాలని బుధవారం అన్నారు.
రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు కుట్రదారు అని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారన్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలన్నారు.
రేవంత్ కేసులో అభియోగాలు తేలిన తర్వాతే చంద్రబాబు పదవి చేపట్టాలన్నారు. అవినీతి మకిలి అంటిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఇంకా మద్దతు పలుకుతారా చెప్పాలని నిలదీశారు. రేవంత్ ఎపిసోడ్ పైన చంద్రబాబుది ఇంకా మౌనమే అన్నారు.
చంద్రబాబు తప్పు చేశారనేందుకు ఆయన మౌనమే నిదర్శనం అన్నారు. జూన్ 2న చంద్రబాబు చేసింది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అన్నారు.
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 8న టీడీపీ మేనిఫెస్టో దహన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. రాజమండ్రిలో ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ రణగర్జన ఉంటుందని అన్నారు. టీడీపీ పార్టీది మహానాడు కాదని, దగానాడని నిప్పులు చెరిగారు.