చంద్రబాబుపై సీఆర్ ఆగ్రహం
కడప: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి విపక్షనేత సీ రామచంద్రయ్య విమర్శించారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంటే కేవలం 31 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామని చెబుతున్న ముఖ్యమంత్రి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలను ప్రకటించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. నకిలీ విత్తన కంపెనీలను మంత్రే ప్రోత్సహిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని వివరించారు. కరువు దెబ్బతో పశువులకు మేత దొరికే పరిస్థితి కన్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాల్లో ప్రభుత్వ ఎమ్మెల్యేలు విశృంఖలంగా ప్రవరిస్తూ ఇసుక వ్యవహారంలో కొట్టుకోవడం వాస్తవం కాదా అన్ని నిలదీశారు. జనచైతన్య యాత్రలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చైతన్యం టీడీపీ నేతల్లో రావాలని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications