తెనాలిలో కరోనా పేషెంట్ పై.. అతని తండ్రితోపాటు పలువురిపై కేసు నమోదు ... రీజన్ ఇదే !!
ఏపీలో కరోనా బాధితుడిపై తొలి కేసు నమోదు అయ్యింది . తెనాలిలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలతో కరోనా పేషంట్ తో పాటు అతని తండ్రిపై , వారికి సహకరించిన లారీ ఓనర్, డ్రైవర్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు . లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకే వారి మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే..
ఏపీలో వలస కార్మికుల తరలింపు చర్యలు మృగ్యమేనా ? తిరుగుబాటు అందుకేనా ?
కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో జనజీవనం స్తంభించింది . ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఇంటికే పరిమితమై ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ సమయంలో చాలా మంది వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న తమ వారిని తీసుకు రావటం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుని లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు . ఇక ఈ క్రమంలోనే లాక్ డౌన్ నిబంధనలు పాటించనందుకు వారిపై కేసు నమోదు చేసారు. తెనాలిలోని ఐతా నగర్ కు చెందిన ఓ యువకుడు చెన్నైలోని ఓ హోటల్ లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కు తెనాలి నుంచి ఓ లారీ వెళ్లగా, లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ను తన కుమారుడికి ఇచ్చిన అతని తండ్రి ఆ లారీలో కుమారుణ్ణి తెనాలికి రప్పించాడు.
అయితే అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో అతను ఎక్కడి నుండి వచ్చాడు , ఎలా వచ్చాడు తెలుసుకున్న అధికారులు వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు . ఇక అతడిని ఐసొలేషన్ కు తరలించారు. జరిగిన విషయాన్ని స్థానిక ఏఎన్ఎం పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా లాక్ డౌన్ నిబంధనలు ఉలంగించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని వారిపై కేసు నమోదు చేసారు. కరోనా బాదితుదిపై, అలాగే అతని తండ్రిపై , అక్రమంగా అతన్ని తీసుకురావటానికి సహకరించిన లారీ డ్రైవర్ , ఓనర్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు .