కేసీఆర్పై వ్యాఖ్య: టీడీపీ పేజీ ఫేస్'బుక్', బెదిరించొద్దని..
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీ పైన హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును హిట్లర్తో పోల్చుతూ ఫేస్బుక్లో ఫోటో పెట్టారని పలువురు ఫిర్యాదు చేశారు.
టీడీపీ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో కేసీఆర్ ఫోటోను పెట్టి, హిట్లర్తో పోల్చినట్లుగా తెలుసుకున్న కొందరు నియోజకవర్గ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై ఐఎన్ఎస్ అభ్యంతరం
మీడియా పైన కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యల పట్ల ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తికైన ప్రచురణల వల్ల ఇబ్బంది కలిగితే అందుకు చట్టపరమైన పరిష్కారాలు ఉన్నాయని గురువారం పేర్కొంది.
కానీ కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్న బెదిరింపులకు ప్రజాస్వామ్య సమాజంలో చోటు లేదని, అదీ ఉన్నతస్థానంలో ఉన్నవారు అలాంటి బెదిరింపులకు పాల్పడటం సరికాదని పేర్కొంది. తమ సొసైటీలో సభ్యత్వం ఉన్న పత్రికలను బెదిరించినా, వేధించినా ప్రతిఘటిస్తామని స్పష్టం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications