నా మీద కేసులు కొత్తేమీ కాదు.. చంద్రబాబు కుట్ర ప్రజలకు తెలుసు : వైఎస్ జగన్
తన మీద కేసులు కొత్తేమీ కాదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, పదేళ్ల క్రితమే దీనిమీద విచారణ జరిగిపోయిందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: తన మీద కేసులు కొత్తేమీ కాదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, పదేళ్ల క్రితమే దీనిమీద విచారణ జరిగిపోయిందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన... అందులో భాగంగానే సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా తదితరులను కలిశారు.
వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వారికి జగన్ వివరించారు. అనంతరం సురవరం, రాజాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు.

తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, కాంగ్రెస్.. టీడీపీ నేతలు ఏకమై ఈ కేసులు పెట్టారని, తన తండ్రి బతికున్నంత కాలం తన మీద ఏ కేసులు లేవని, అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసులు లేవని, దానిలోంచి బయటికొచ్చిన తరువాతే తనపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు అధికారంలో ఉన్న సోనియాగాంధీతో కలిసి చంద్రబాబునాయుడే తన పార్టీ నాయకుల ద్వారా తనపై ఈ కేసులు పెట్టించారన్నారు. నిజానికి ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే.. మూడు నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు.
జగన్ కనపడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు, తనను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ కలిసి ఈ కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. కేసులతో ఇప్పుడు వీళ్లు కొత్తగా చేయగలిగిందేమీ లేదని, పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు.. అందరికీ అన్నీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications