క్లైమాక్స్కు చేరుకున్న నోటుకు ఓటు: డిజిపితో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు క్లైమాక్స్ దశకు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం రాష్ట్ర డిజిపి జెవి రాముడితో సమావేశమయ్యారు. డిజిపితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
నోటుకు ఓటు కేసుపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో ఫోన్ మాట్లాడిన గొంతు తనదేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ తేల్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు వారితో తదుపరి పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డు ట్యాపింగ్ వెర్షన్ కాదని, అది ఒక ఫోన్ నుంచి మరో ఫోన్కు వచ్చిన కాల్ను రికార్డు చేసిన టేప్ అని ఎఫ్ఎస్ఎల్ ధ్రువీకరించిందని అంటున్నారు. టిజిపి నేతలు ఆరోపిస్తున్నట్లుగా వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాటలను ఏరి కూర్చి గుదిగుచ్చింది కాదని కూడా ఎఫ్ఎస్ఎల్ తేల్చినట్లు సమాచారం.

ఈ పరిస్థితిలో తెలంగాణ ఎసిబి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గురువారం రాత్రి లేదా శుక్రవారంనాడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని, నోటీసు అందుకున్న నాటి నుంచి 72 గంటల్లో విచారణకు హాజరు కావాలని కోరబోతున్నామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినందు వల్ల బిజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు గడువు ఇస్తామని ఎసిబి అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
చంద్రబాబు కన్నా ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులను, ఇద్దరు శాసనసభ్యులను, ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications