Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవినాశ్ బెయిల్ రద్దు చేయండి - సుప్రీంలో సీబీఐ పిటీషన్..!!

వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతా రెడ్డి సవాలు చేశారని ప్రస్తావించింది. దీంతో, ఇప్పుడు విచారణ సమయంలో సుప్రీం నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.

సుప్రీంలో సునీత పిటీషన్ :వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్యకు దాడి చేసిన పరిణామాలు అనంతరం సాక్షాదారాల జరిపివేతలో నిందితులు పాల్గొన్న తీరును ప్రస్తావించింది.

CBI Files Affidavit in Sunitha petition on YS Avinash Reddy bail cancel in Supreme court

ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లకు వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని మరోసారి సిపిఐ పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించారని ఎప్పటికి వివరించింది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని షర్మిల విజయమ్మల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని వివేక పట్టుబట్టినట్టు వివరించింది.

సీబీఐ అఫిడవిట్ : దీన్ని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివ శంకర్ రెడ్డి భరించలేకపోయారని సిబిఐ చెప్పుకొచ్చింది. వివేక హత్యకు ఈ ముగ్గురే కుట్ర పన్నినట్లు హత్యా స్థలంలో లభించిన సాక్షాదారాలు చెబుతున్నాయని సిపిఐ వివరించింది. హత్య తర్వాత జరుగుతున్న పరిణామాల పై అప్రూవర్ గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసింది.

CBI Files Affidavit in Sunitha petition on YS Avinash Reddy bail cancel in Supreme court

ఈ ముగ్గురి సమక్షంలోని చెరిపివేసినట్లు వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించింది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు మెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరుకావాలని షరతు విధించింది. ఈ మేరకు ప్రతివారం అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరవుతున్నారు.

సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ :కాగా, డాక్టర్ సునీత హైకోర్టు నిర్ణయం పైన సుప్రీం ఆశ్రయించారు. తన అభ్యంతరాలను వాదనలను కోర్టు ముందు ఉంచారు. వీటిని విన్న న్యాయస్థానం ఈనెల 11న ఈ కేసు విచారణకు నిర్ణయించింది అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దాఖలు చేసిన సిబిఐ ఈ మేరకు గతంలో ప్రస్తావించిన అంశాలనే మరోసారి ఈ కౌంటర్లో వివరించింది. దీంతో ఇప్పుడు విచారణ తర్వాత సుప్రీంకోర్టు అవినాష్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+