ఏపీ నిట్లో 8 కోర్సులు, 480 సీట్లు: వచ్చే ఏడాది నుంచి అమలు
అమరావతి: ఏపీలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కోర్సులు, సీట్లు ఖరారైనట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు లేఖ రాశారు.
దీంతో ఏపీ నిట్లో కోర్సులు, సీట్లపై స్పష్టత వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకానున్న ఏపీ నిట్లో మొత్తం 8 కోర్సులు, 480 సీట్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేంద్రం ఒక లేఖ రాసింది.

ఏపీ నిట్లో కోర్సులు:
* బయో టెక్నాలజీ - 30 సీట్లు
* కెమికల్ ఇంజనీరింగ్ - 30
* సివిల్ ఇంజనీరింగ్ - 60
* కంప్యూర్ సైన్స్ ఇంజనీరింగ్ - 90
* ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 90
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - - 90
* మెకానికల్ ఇంజనీరింగ్ - 60
* మెట్రలజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 30 చొప్పున సీట్లు కేటాయిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.
ఏపీ నిట్కు కేటాయించిన 480 సీట్లలో సగం సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్దులకే కేటాయించింది. మిగిలిన సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్ధులకు కేటాయించింది. ఇక, వరంగల్ నిట్లో సూపర్ న్యూమరరీ కింద ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర విద్యార్దులకు 60 సీట్లు కేటాయించింది.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications